Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్‌ 16 నుంచి రంజీ ట్రోఫీ.. 2,127 మ్యాచ్‌ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్

Webdunia
శనివారం, 3 జులై 2021 (23:08 IST)
గతేడాది కోవిడ్ కారణంగా సరిగ్గా నిర్వహించలేకపోయిన దేశవాళీ క్రికెట్‌ను బీసీసీఐ ఈసారి పూర్తిస్థాయిలో జరపడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా  మొత్తం 2,127 మ్యాచ్‌ల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. 
 
నవంబర్‌ 16 నుంచి రంజీ ట్రోఫీ మొదలవ్వనున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతేడాది కరోనా నేపథ్యంలో రంజీ ట్రోఫీతో పాటు మిగతా  టోర్నీలేవీ జరగని సంగతి తెలిసిందే.
 
అప్పుడు కేవలం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారే ట్రోఫీలు మాత్రమే నిర్వహించింది. ఈ ఏడాది అలా కాకుండా అన్ని టోర్నీలను మునుపటిలా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ‘ఈ 2021-22 సీజన్‌ సెప్టెంబర్‌ 21 నుంచి సీనియర్‌ మహిళల వన్డే లీగ్‌తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అక్టోబర్‌ 27 నుంచి సీనియర్‌ మహిళల వన్డే ఛాలెంజర్‌ ట్రోఫీ ఉంటుంది. 
 
ఈ క్రమంలోనే అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 12 వరకు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ, నవంబర్‌ 16 నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు రంజీ ట్రోఫీలు జరగనున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 26 వరకు విజయ్‌ హజారే ట్రోఫీ నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రయాణికురాలి చెంప ఛెళ్లుమనిపించిన ర్యాపిడో బైక్ రైడర్

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

తర్వాతి కథనం
Show comments