Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ తలకు వెల కట్టిన లష్కరే తోయిబా

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (16:36 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తలకు ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వెల కట్టింది. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారమన్‌తో పాటు మరికొందరు కేంద్ర మంత్రుల తలకు కూడా వెల కట్టింది. వీరందరి పేర్లను హిట్ లిస్టులో చేర్చింది. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 370 అధికరణను రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలితప్రాంతాలుగా చేసింది. దీన్ని పాకిస్థాన్‌తో పాటు.. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలు జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతో భారత్‌లో విధ్వంసం సృష్టించాలన్న తపనతో రగిలిగిపోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖులను లక్ష్యంగా చేసుకుంది. ఎక్కువ శాతం రాజ‌కీయ‌వేత్త‌ల‌ను టార్గెట్ చేసే హిట్‌లిస్టులో క్రికెట‌ర్ కోహ్లీ పేరు ఉండటం ఇదే మొద‌టిసారి. నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఏ)కి అందిన లేఖ‌లో ఆ పేర్లు ఉన్నాయి. 
 
కోళికోడ్‌‌ నుంచి ఆ లేఖ రిలీజైంది. ఇక బంగ్లాతో న‌వంబ‌రు 3వ తేదీన కోహ్లీసేన తొలి టీ20 మ్యాచ్ ఆడ‌నున్న‌ది. ఈ నేపథ్యంలో ఈ బెదిరింపు లేఖ రావడంతో కోహ్లీకి ఢిల్లీ పోలీసులు భద్రతను మరింతగా పెంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

తర్వాతి కథనం
Show comments