Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కెప్టెన్‌గా అజారుద్దీన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ

కెప్టెన్‌గా అజారుద్దీన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ
, సోమవారం, 21 అక్టోబరు 2019 (20:36 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాడు. ఇప్పటికే అనేక రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగిపోతున్న కోహ్లీ.. తాజాగా మరో రికార్డును బ్రేక్ చేశాడు. మొన్నటికిమొన్న బ్రాడ్‌మెన్ రికార్డును బద్ధలు కొట్టిన కోహ్లీ... ఇపుడు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసి తన పేరిట లిఖించుకున్నాడు. 
 
కెప్టెన్‌గానే కాకుండా, ఒక ఆటగాడిగా కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్న విషయం తెల్సిందే. నిలకడగా ఆడుతూ పరుగుల వరద పారిస్తూనే జట్టుకు కూడా చిరస్మరణీయ విజయాలన్నందిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళ్తున్నాడు. టెస్టు క్రికెట్లో ప్రత్యర్థి జట్లను అత్యధిక సార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. భారత మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ రికార్డును ప్రస్తుత కెప్టెన్ విరాట్ బ్రేక్ చేశాడు. 
 
సౌతాఫ్రికాతో మూడో టెస్టులో సౌతాఫ్రికాను ఫాలోఆన్ ఆడించడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. రాంచీ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలడంతో భారత్‌కు 335 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో సౌతాఫ్రికాని భారత క్రికెట్ జట్టు ఫాలోఆన్ ఆడిస్తోంది. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విరాట్ ఎనిమిది సార్లు ఫాలోఆన్ ఆడించాడు. అజారుద్దీన్(7), మహేంద్ర సింగ్ ధోనీ(5), సౌరభ్ గంగూలీ(4) ఫాలోఆన్ ఆడించిన జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పుణె టెస్టులోనూ డుప్లెసిస్‌సేన ఫాలోఆన్ ఆడి ఓడిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సఫారీల వెన్నువిరిచిన భారత బౌలర్లు.. ఫాలోఆన్‌కు ఆహ్వానం