Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సఫారీల వెన్నువిరిచిన భారత బౌలర్లు.. ఫాలోఆన్‌కు ఆహ్వానం

Advertiesment
India
, సోమవారం, 21 అక్టోబరు 2019 (14:02 IST)
రాంచి వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. ఫలితంగా సఫారీలు చేతులెత్తేశారు. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్టును ఫాలోఆన్‌కు ఆహ్వానించాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 116.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 497 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో పాటు.. రహానె సెంచరీ, ఉమేష్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ద్వారా వచ్చిన 31 పరుగులు ఉన్నాయి. 
 
ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో ఎల్గర్‌ (0), డికాక్‌ (4),  డుప్లెసిస్ ( 1) ఔట్ కాగా, హంజా గరిష్టంగా 62 పరుగులు చేశాడు. 
 
అలాగే, బవుమా (72 బంతుల్లో 32), క్లాసేన్ (10 బంతుల్లో 6), పైడ్త్ (14 బంతుల్లో 4), రబాడా (6 బంతుల్లో 0), లిండె (81 బంతుల్లో 37), నోర్ట్ జె (55 బంతుల్లో 4), ఎన్గిడి (0, నాటౌట్) వెనుదిరిగారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 335 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో దక్షిణాఫ్రికాకు కొహ్లీ సేన ఫాలో‌ఆన్ ఇచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాబాజ్ తొలి వికెట్.. మైదానంలో సంబరాలు వీడియో వైరల్