మహేంద్ర సింగ్ ధోనీపై పరువునష్టం కేసు

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (12:15 IST)
టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీపై ఢిల్లీలో పరువునష్టం కేసును ఆయన వ్యాపార భాగస్వాములు నమోదు చేశారు. ధోనీ మాజీ వ్యాపార భాగస్వాములు, ఆర్కా స్పోర్ట్స్ డైరెక్టర్లు మిహిర్ దివాకర్, అతడి భార్య సౌమ్య దాస్ ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. 
 
ఒప్పందాన్ని ఉల్లంఘించడం, హానికరమైన ప్రకటనలు చేసి ధోనీ తమ పరువుకు భంగం కలిగించారని, అందుచేత నష్టపరిహారం చెల్లించాలని పిటిషనర్లు కోరారు. 
 
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, అనేక మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై తమకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా నియంత్రించాలని కోర్టును అభ్యర్థించారు.
 
2017 ఒప్పందాన్ని ఉల్లంఘించి తనకు చెల్లించాల్సిన రూ. 16 కోట్లు ఎగ్గొట్టారని ధోనీ చేసిన ఆరోపణలు తమ ప్రతిష్ఠను దెబ్బ తీస్తున్నాయని పిటిషన్‌లో  పేర్కొన్నారు. ఈ కేసుపై జనవరి 18న (గురువారం) ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. 
 
కాగా దివాకర్, అతడి భార్య దాస్ తనను రూ.16 కోట్లకు మోసం చేశారంటూ ఎంఎస్ ధోనీ ఇటీవలే క్రిమినల్ కేసు పెట్టారు. దీంతో ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద రాంచీ కోర్టులో కేసు నమోదయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తనను ప్రేమించను అన్నందుకు బాలికను తుపాకీతో కాల్చిన దుండగుడు (video)

Chevireddy: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టు చేసిన పోలీసులు - 12మంది అరెస్ట్

ఆదిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధి: 700 ఎకరాల భూమికి ఆమోదం

Jagan Visits Cyclone areas: కృష్ణా జిల్లాలోని మొంథా తుఫాను ప్రాంతాల్లో జగన్ పర్యటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Mammootty: 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో మెరిసిన మమ్ముట్టి భ్రమయుగం

Chinnay : రాహుల్ రవీంద్రన్, చిన్నయ్ వివాహంపై సెటైర్లు

Chandini Chowdary,: తరుణ్ భాస్కర్ క్లాప్ తో చాందినీ చౌదరి చిత్రం లాంచ్

Bandla Ganesh: వార్నింగ్ లు రాజకీయాల్లోనే సినిమాల్లో కాదు - హీరోలపైనా బండ్ల గణేష్ సెటైర్

తర్వాతి కథనం
Show comments