Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్‌లో ఉంటేనే భారత క్రికెట్ జట్టులో చోటు : ఎస్. భద్రీనాథ్

వరుణ్
ఆదివారం, 21 జులై 2024 (16:01 IST)
బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్‌లో ఉంటేనే భారత క్రికెట్ జట్టులో చోటు దక్కుతుందా అంటూ మాజీ క్రికెటర్ ఎస్.భద్రీనాథ్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన టీ20తో పాటు ఈ నెలాఖరు నుంచి ప్రారంభంకానున్న శ్రీలంక పర్యటనల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో పలువురు ప్రతిభావంతులైన ఆటగాళ్లను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. దీనిపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వారిలో రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలు ఉన్నారు. ఇలాంటి యువ క్రికెటర్లకు జట్టులో చోటు కల్పించకపోవడంతో అనేక మంది మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
దీనిపై మాజీ క్రికెటర్ ఎస్.భద్రీనాథ్ ఒకింత ఘాటుగా స్పందించారు. శ్రీలంక టూర్‌కు రుతురాజ్‌ను ఎంపిక చేయకపోవడం షాకిచ్చింది. జట్టులోకి ఎంపిక కావడానికి ట్యాలెంట్ కంటే బ్యాడ్ బాయ్ ఇమేజ్ ఎంతో అవసరమని ఒక్కోసారి అనిపిస్తుంది. భారత క్రికెట్ జట్టు తరపున ఆడాలంటే బాలీవుడ్ హీరోయిన్లతో రిలేషన్‌షిప్‌లో ఉండాలేమో... ఒళ్ళంతా టాటూలు వేయించుకోవాలేమో లేదా మంచి మీడియా మేనేజరును కలిగివుండాలేమో అంటూ బద్రీనాథ్ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments