Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక అభిమానిని కలిసిన స్మృతి మందాన.. గిఫ్ట్‌గా ఏమిచ్చిందో తెలుసా? (video)

సెల్వి
శనివారం, 20 జులై 2024 (17:24 IST)
Smriti Mandhana
మహిళల ఆసియా కప్ 2024లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ సూపర్ స్టార్ స్మృతి మందాన మెరిసింది. ఈ స్టైలిష్ ఎడమచేతి వాటం ప్లేయర్ మైదానంలో ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో వార్తల్లో నిలిచిపోతుంది. 
 
తాజాగా క్రికెట్ ద్వారా ప్రేక్షకులను, తన అభిమానులను ఆకట్టుకునే స్మృతి మందాన.. శ్రీలంక ఫ్యాన్‌ను మైదానంలో కలిసి వార్తల్లో నిలిచింది. శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్‌ తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంకకు చెందిన ఓ చిన్నారి అభిమానిని ఆమె కలిసింది. 
 
అదీషా హెరాత్‌ అనే చిన్నారికి స్మృతి మందాన అంటే చాలా ఇష్టం. ఆమెను కలవాలని ఎన్నో సార్లు తన తల్లితో చెప్పేది. ఆ చిన్నారి అదీషా హెరాత్‌‌ కోరిక మేరకు స్మృతి మందాన స్టేడియంలోనే సర్ ప్రైజ్ చేసింది. అదీషా హెరాత్‌‌‌తో కాసేపు గడిపింది. ఆపై ఓ ఫోన్ కూడా గిఫ్ట్ చేసింది. తన బిడ్డను మందాన కలవడం అదృష్టం అని.. ఆమె నుంచి ఫోన్ గిఫ్ట్‌గా పొందడం హ్యాపీగా వుందని చెప్పుకొచ్చారు అదీషా హెరాత్‌ తల్లి. ఈ మూమెంట్ నెట్టింట వీడియో రూపంలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూయార్క్ చెరువుల్లో తేలిన తెలుగు దంపతుల కుమార్తెలు

పసుపు ప్యాకెట్లలో గంజాయి.. డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు

ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితులకు 1000 రిలీఫ్ కిట్‌లను పంపిణీ చేసిన ఇండస్ టవర్స్

కాకినాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. హైడ్రా వ్యవస్థపై..?

బంగాళాఖాతంలో గణేష్ నిమజ్జనం.. ముగ్గురు యువకులు గల్లంతు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రఘు తాత లో హిందీ కష్టాలు చెప్పిన కీర్తి సురేష్

యండమూరి అంతర్ముఖం వెండి తెరపై కి తేనున్న తుమ్మలపల్లి

స్కూల్ లో నాటకాలు రాయడం, ప్రదర్శించా, అది ఉత్సవం చిత్రానికి యూస్ అయింది : నటుడు దిలీప్ ప్రకాష్

కిరణ్ అబ్బవరం క సినిమా మలయాళం థియేట్రికల్ రైట్స్ తీసుకున్న దుల్కర్ సల్మాన్

నాన్న సూపర్ హీరో చిత్రంలో సుధీర్ బాబు ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments