Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక అభిమానిని కలిసిన స్మృతి మందాన.. గిఫ్ట్‌గా ఏమిచ్చిందో తెలుసా? (video)

సెల్వి
శనివారం, 20 జులై 2024 (17:24 IST)
Smriti Mandhana
మహిళల ఆసియా కప్ 2024లో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ సూపర్ స్టార్ స్మృతి మందాన మెరిసింది. ఈ స్టైలిష్ ఎడమచేతి వాటం ప్లేయర్ మైదానంలో ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో వార్తల్లో నిలిచిపోతుంది. 
 
తాజాగా క్రికెట్ ద్వారా ప్రేక్షకులను, తన అభిమానులను ఆకట్టుకునే స్మృతి మందాన.. శ్రీలంక ఫ్యాన్‌ను మైదానంలో కలిసి వార్తల్లో నిలిచింది. శ్రీలంకలో జరుగుతున్న ఆసియా కప్‌ తొలి మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంకకు చెందిన ఓ చిన్నారి అభిమానిని ఆమె కలిసింది. 
 
అదీషా హెరాత్‌ అనే చిన్నారికి స్మృతి మందాన అంటే చాలా ఇష్టం. ఆమెను కలవాలని ఎన్నో సార్లు తన తల్లితో చెప్పేది. ఆ చిన్నారి అదీషా హెరాత్‌‌ కోరిక మేరకు స్మృతి మందాన స్టేడియంలోనే సర్ ప్రైజ్ చేసింది. అదీషా హెరాత్‌‌‌తో కాసేపు గడిపింది. ఆపై ఓ ఫోన్ కూడా గిఫ్ట్ చేసింది. తన బిడ్డను మందాన కలవడం అదృష్టం అని.. ఆమె నుంచి ఫోన్ గిఫ్ట్‌గా పొందడం హ్యాపీగా వుందని చెప్పుకొచ్చారు అదీషా హెరాత్‌ తల్లి. ఈ మూమెంట్ నెట్టింట వీడియో రూపంలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

తర్వాతి కథనం
Show comments