Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ - పోలీసులు విఫలమయ్యారు : చంద్రబాబు

Webdunia
బుధవారం, 25 మే 2022 (08:57 IST)
పచ్చటి కోనసీమలో అగ్గి రాజుకోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమేనని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. ఆందోళనకారులు మంగళవారం అమలాపురంలో తీవ్ర విధ్వంసం సృష్టించారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ బాబుల ఇళ్లకు నిప్పటించారు. అయితే, ఈ అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయంటూ ఏపీ హోం మంత్రి తానేటి వనిత ఆరోపించారు. 
 
వీటిని టీడీపీ, జనసేన పార్టీలు ఖండించారు. ఇదే అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ, కోనసీమలో ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. సున్నితమైన అంశంలో హోం మంత్రి నిరాధార ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. ప్రశాంతంగా ఉండే కోనసీమలో ఘర్షణలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. 
 
ఇది ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments