Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గంజాయి వ్యాపారులపై దాడులు చేస్తారా? చంద్రబాబు ఆగ్రహం

గంజాయి వ్యాపారులపై దాడులు చేస్తారా? చంద్రబాబు ఆగ్రహం
, శనివారం, 21 మే 2022 (11:51 IST)
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి అమ్మేవారిపై దాడులు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి కాదు... టంగ్ స్లిప్ కావడంతో ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. 
 
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆయన టీడీపీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గంజాయికి ఎక్కువ మంది బానిసలవుతున్నారన్నారు. గుంటూరులో యువకులు గంజాయి మత్తులో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. ఇలాంటి మత్తు పదార్థాల నుంచి యువతను కాపాడుకోవాలన్నారు. 
 
మరోవైపు, ఇక పార్టీని ఈసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నానని.. ప్రధానంగా 40 శాతం సీట్లు యువతకు కేటాయిస్తానని.. కొత్తగా వచ్చేవారికి అవకాశమిస్తానన్నారు. తన వయసు 72 ఏళ్లయినా మీకోసం 27 ఏళ్ల కుర్రాడిలా పనిచేస్తానని ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ ప్రజలకు శుభవార్త.. తగ్గనున్న టమోటా ధరలు.. ఎలాగంటే?