Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టుకు వర్షం అంతరాయం

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (13:00 IST)
studium
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట ముందే ముగిసింది. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 1.5 ఓవర్లలో 4 పరుగులు చేసింది. 
 
ఈ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత చాలా సేపటి వరకూ వర్షం కురుస్తూనే ఉండటంతో నాలుగో రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉండగా.. టీమిండియా విజయానికి 324 పరుగుల దూరంలో ఉంది. రోహిత్ శర్మ (4 నాటౌట్‌), శుభ్‌మన్ గిల్‌(0 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు.
 
సిరాజ్‌కు 5 వికెట్లు..
అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే.. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా 327 పరుగుల లీడ్‌లో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీయడం విశేషం. సీనియర్ బౌలర్లు లేకపోయినా ఆ భారాన్ని తన భుజాలపై మోసిన సిరాజ్‌..
 
టెస్ట్ కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అటు శార్దూల్ కూడా 4 వికెట్లతో రాణించాడు. సుందర్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా టీమ్‌లో స్మిత్ 55, వార్నర్ 48, గ్రీన్ 37 పరుగులు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.. ఆపై కరెంట్ షాక్ కూడా.. బావతో కలిసి చంపేసింది..

తిరుపతిలో ఘోరం.. అనుమానం.. భార్య గొంతుకోసి చంపేసి.. ఆపై భర్త ఏం చేశాడంటే?

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Dhanush: ధనుష్ మిస్టర్ కార్తీక్ రీ రిలీజ్ కు సిద్ధమైంది

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

తర్వాతి కథనం
Show comments