Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్.. రాజ్ నాథ్ సింగ్ ఏమన్నారు..?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (14:46 IST)
ప్రపంచ కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ జరిగే అవకాశం లేదని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కాశ్మీర్‌లో ఫిబ్రవరి 14న తేదీన జైషే అనే ఉగ్రవాద మూకలు నిర్వహించిన ఆత్మాహుతి దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు 40 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
 
ఈ ఉగ్రవాద సంస్థకు పాకిస్థాన్ మద్దతిచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తద్వారా పుల్వామా దాడితో భారత్-పాక్‌ల మధ్య ప్రపంచ కప్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
 
ఈ మ్యాచ్‌ను యధావిధిగా జరపాల్సిందేనని ఐసీసీ తేల్చేసింది. అయితే భవిష్యత్తులో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదని టీమిండియా మాజీ క్రికెటర్లు అంటున్నారు. కానీ సచిన్ లాంటి వారు మాత్రం పాకిస్థాన్‌లో మ్యాచ్ ఆడి తీరాల్సిందేనని చెప్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఇకపై వాణిజ్యం, క్రికెట్ వంటివి వుండవని తెలిపారు. దీంతో భారత్- పాకిస్థాన్‌ల మధ్య ప్రపంచ కప్ మ్యాచ్ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

తర్వాతి కథనం
Show comments