Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పద్ధతేం బాగోలేదు.. ఇలాగైతే కష్టం.. ఒలింపిక్ కమిటీ

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (12:02 IST)
భారత్‌పై ఒలింపిక్ కమిటీ ఫైర్ అయ్యింది. ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు వచ్చే పాకిస్థాన్ షూటర్లకు భారత్ వీసాలు నిరాకరించడంపై ఐవోసీ మండిపడింది. భారత్ నిర్ణయంతో భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇచ్చే విషయమై భారత్‌తో చర్చలు నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది. 
 
ఢిల్లీలో జరగనున్న ప్రపంచకప్‌ పోటీల నుంచి పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్‌ ఈవెంట్‌కు ఒలింపిక్‌ అర్హత హోదాను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. భారత్‌ తీరును తప్పుబట్టిన ఐవోసీ...అంతర్జాతీయ క్రీడా పోటీల్లో అన్ని దేశాల అథ్లెట్లను, క్రీడా ప్రతినిధులను సమానంగా చూడాలని హితవు పలికింది. 
 
అథ్లెట్ల మధ్య ఆతిథ్య దేశం ఎలాంటి వివక్ష చూపకూడదని.. ఆటల్లో దేశ రాజకీయాలకు చోటే లేదని.. భారత్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడంతోనే ఆ దేశంతో ఒలింపిక్స్‌కు ఆతిథ్యంపై చర్చలను ఆపేయాలని నిర్ణయించినట్లు ఒలింపిక్ కమిటీ వెల్లడించింది. 
 
ఒలింపిక్‌ నిబంధనలకు అనుగుణంగా వివిధ దేశాల పోటీదారులకు అనుమతి ఇస్తామని భారత సర్కార్ నుంచి లిఖితపూర్వకమైన హామీ వచ్చేంత వరకు ఒలింపిక్‌ సంబంధింత పోటీల నిర్వహణకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments