Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకేంటి ప్రాబ్లమ్.. పీసీబీకి షాకిచ్చిన ఐసీసీ (video)

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (12:12 IST)
పుల్వామా ఘటన నేపథ్యంలో.. సీఆర్పీఎఫ్ జవాన్లను గౌరవించే దిశగా భారత క్రికెటర్లు ఆర్మీ టోపీతో ఆడింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా క్రికెటర్లు ఆర్మీటోపీతో కనిపించారు. అయితే ఆర్మీ టోపీని ధరించి టీమిండియా క్రికెటర్లు క్రికెట్ ఆడటంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మండిపడింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఐసీసీని కోరింది. 
 
కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే ట్వంటీ-20 సిరీస్ నెగ్గింది. అలాగే ఐదు వన్డేల్లో నాలుగు వన్డేలు ఆడింది. ఇందులో మూడో వన్డేలో భాగంగా భారత క్రికెటర్లు జవాన్లను గౌరవించే దిశగా ఆర్మీ టోపీలను ధరించి మైదానంలో ఆడారు. ఈ టోపీలను ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా వున్న ధోనీ ఆటగాళ్లకు అందించాడు.
 
అంతేగాకుండా ఆ రోజు నాటి మ్యాచ్ ఫీజును టీమిండియా క్రికెటర్లు పుల్వామా సీఆర్పీఎఫ్ కుటుంబీకులకు అందజేశారు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. క్రికెట్ ఆటలో రాజకీయాలెందుకని ప్రశ్నించింది. క్రికెట్ జెంటిల్మెన్ క్రీడ అని గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై ఐసీసీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ వివరణ ఇచ్చింది. పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్లకు అంజలి ఘటించే దిశగా టీమిండియా క్రికెటర్లు ఆర్మీ క్యాప్ ధరించారని.. ఆ రోజు మ్యాచ్ ఫీజు కూడా జవాన్ల కుటుంబీకులకు అందజేశారని ఐసీసీ స్పష్టం చేసింది. అలాగే ఐసీసీ అనుమతితోనే బీసీసీఐ టీమిండియా క్రికెటర్లకు ఆర్మీ క్యాప్‌తో ఆడారని ఐసీసీ స్పష్టం చేసింది. కాబట్టి ఇందులో ఎలాంటి నియమాలను భారత్ ఉల్లంఘించలేదని ఐసీసీ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

తర్వాతి కథనం
Show comments