Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదో వన్డే టెన్షన్ మనకే కానీ కోహ్లి చక్కగా కుక్కతో ఎంజాయ్... ధోనీ ఆడడా?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (20:46 IST)
గెలవాల్సిన మ్యాచ్‌ని చెత్త ఫీల్డింగుతో చేజేతులా చేజార్చుకుని క్రికెట్ అభిమానులను ఉస్సూరుమనిపించిన టీమిండియా కుర్రాళ్లు ఐదవ వన్డే ఆడేందుకు ఢిల్లీ చేరుకున్నారు. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో ఆదివార నాడు మ్యాచ్ ఓడిపోయినప్పటికీ హైదరాబాద్, నాగ్‌పూర్‌లో గెలిచింది భారత జట్టు. దీనితో ఇరు జట్లు 2-2తో వున్నాయి. ఈ నేపధ్యంలో ఐదో వన్డేపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని వుంది. ఎలాగైనా గెలిచి తీరాల్సిందే. 
 
ఐదో వన్డే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం నాడు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదిలావుంటే ఢిల్లీ చేరుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నేరుగా ఇంటికి వెళ్లి పెంపుడు శునకంతో ఆడుకుంటూ ఆ ఫోటోలు పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు చూసినవారు కొందరు వావ్ అని కామెంట్లు పెడుతుంటే మరికొందరు... ఐదే వన్డే టెన్షన్ మనకే కానీ కోహ్లి చూడండి... చక్కగా కుక్కతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, మనం కూడా ఇలాగే వుండాలి. ఒత్తిడి, టెన్షన్ పడకూడదంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. 
 
ఇకపోతే నాలుగో వన్డేలో వికెట్ కీపర్ గా వ్యవహరించిన పంత్... ఐదో వన్డేలో కూడా ఆడుతాడని అంటున్నారు. ఈ లెక్కన ధోనీ రిజర్వ్ బెంచిలోనే వుండి ఆట చూడాలన్నమాట. అదీ సంగతి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments