Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ క్రికెటర్లు - మాజీ అంపైర్లకు బీసీసీఐ శుభవార్త

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (07:54 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాజీ క్రికెటర్లు, మాజీ అంపైర్లకు శుభవార్త చెప్పింది. వీరికి కొత్త పెన్షన్ పథకాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. పురుష, మహిళా మాజీ క్రికెటర్లకు, మాజీ అంపైర్లకు ఇచ్చే నెలవారీ పెన్షన్ మొత్తాన్ని పెంచుతున్నట్టు బీసీసీఐఓ ప్రకటనలో పేర్కొంది. 
 
ఇదే అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ, మాజీ ఆటగాళ్ల ఆర్థిక పరిస్థితులను కూడా మేం పరిగణలోకి తీసుకోవాల్సివుందన్నారు. క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన తర్వాత వారి బాగోగులు చూసుకోవడం బోర్డు కర్తవ్యమన్నారు. నిజానికి మాజీ క్రికెటర్ల కంటే మాజీ అంపైర్లకు పెద్దగా గుర్తింపు ఉండదన్నారు. ఇలాంటి వారిని ఆదుకుని, వారి సేవలకు ఎంతో విలువ ఇవ్వాల్సివుందన్నారు. 
 
మరోవైపు, వీరికి నెలకు రూ.15 వేలు పెన్షన్ ఇస్తుండగా, ఇపుడు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసి రూ.30వేలుగా ఇవ్వనున్నారు. అలాగే  రూ.22500 అందుకునేవారు రూ.45000, రూ.30 వేలు అందుకునేవారు రూ.52 వేలు, రూ.37500 అందుకునేవారు రూ.60 వేలు, రూ.50 వేలు అందుకునేవారు రూ.70 వేలు చొప్పున పెన్షన్ అందుకుంటారని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

తర్వాతి కథనం
Show comments