Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ సేన ఓడిపోయిందనీ... ఆసీస్ క్రికెటర్ల బస్సుపై రాళ్ళ వర్షం...

మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా, మంగళవారం రాత్రి గౌహతి వేదికగా రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో కోహ్లీ సేన ఓడిపోయింది. దీంతో ఆగ్రహించిన గౌహతి నగర వాసులు ఆస్ట్రేలియా క్రికె

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (10:04 IST)
మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా, మంగళవారం రాత్రి గౌహతి వేదికగా రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో కోహ్లీ సేన ఓడిపోయింది. దీంతో ఆగ్రహించిన గౌహతి నగర వాసులు ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రయాణించిన బస్సుపై రాళ్లు రువ్వారు. దీంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఈ రాళ్ళదాడి కలకలం రేపింది. పైగా, రెండు నెలల వ్యవధిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎదుర్కొన్న రాళ్లదాడి ఘటనల్లో ఇది రెండోది. 
 
సెప్టెంబరులో చిట్టగ్యాంగ్‌లో బంగ్లాదేశ్‌తో ఓ టెస్టు మ్యాచ్ అనంతరం వెళుతున్నప్పుడూ ఇలాగే రాళ్లు విసిరారు. "ఓ బలమైన రాయి వచ్చి మా బస్సు అద్దాన్ని పగులగొట్టింది. చాలా భయం వేసింది" అని ఆసీస్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ పగిలిన అద్దం ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. ఘటన తర్వాత, మరింత రక్షణ మధ్య ఆటగాళ్లను తరలించారు. ఆపై రాష్ట్ర మంత్రి హేమంత్ విశ్వ శర్మ స్పందిస్తూ, ఆస్ట్రేలియా జట్టుపై రాళ్లదాడికి చింతిస్తున్నట్టు తెలిపారు. 
 
దీనిపైనే రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ స్పందిస్తూ, ఇది భద్రతాపరమైన లోపం ఎంతమాత్రమూ కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడామని, ఆటగాళ్లకు భద్రతకు కల్పించడం తమ కర్తవ్యమని చెప్పారు. కాగా, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఓ క్రికెట్ బాల్ సైజులో ఉన్న రాయి అద్దాన్ని తాకిందని 'క్రికెట్ ఆస్ట్రేలియా' తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments