Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టి క్రికెట్‌లో సంచలనం.. ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డ్

పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డును నమోదుచేసింది. శుక్రవారం ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (16:48 IST)
పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా వరల్డ్ రికార్డును నమోదుచేసింది. శుక్రవారం ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 244 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 5 వికెట్ల తేడాతో ఆ జట్టుపై విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టులో 24 బంతుల్లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ 59 పరుగులు చేయగా, షార్ట్ 44 బంతుల్లో 76 పరుగులు చేశాడు. 
 
వీరిద్దరూ ఔట్ అయ్యాక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు కూడా ధాటిగా ఆడారు. క్రిస్ లిన్ 13 బంతుల్లో 18, మాక్స్‌వెల్ 14 బంతుల్లో 31, ఫించ్ 14 బంతుల్లో 36 పరుగులు చేసి అవుట్ కాగా.. స్టోయినిస్ 5 బంతుల్లో 4, అలెక్స్ కారే ఒక బంతి ఆడి ఒక పరుగు తీసి నాటౌట్‌గా నిలిచి మరో 7 బంతులు మిగిలి ఉండగానే, ఆస్ట్రేలియాను విజయ తీరానికి చేర్చారు. 
 
ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు అదనంగా 20 పరుగులు ఇవ్వడం గమనార్హం. దీంతో 245/5 (18.5 ఓవర్లలో) పరుగులు చేయగలిగింది. 44 బంతుల్లో 76 పరుగులు చేసిన షార్ట్‌కి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. భారీ విజయలక్ష్యాన్ని మరో ఏడు బంతులు మిగిలివుండగానే కివీస్ ఛేదించడం ప్రపంచ రికార్డుగా నమోదైంది. 

ఇప్పటివరకు 232 పరుగుల లక్ష్యసాధనే ప్రపంచ రికార్డుగా ఉండేది. దీన్ని ఆస్ట్రేలియా బ్రేక్ చేసింది. 2018లో సౌతాఫ్రికా నిర్ధేశించిన 232 టార్గెట్‌ను వెస్టిండీస్ ఆటగాళ్లు 6 వికెట్లను కోల్పోయి 236 పరుగులు చేశారు. అలాగే, 2016లో సౌతాఫ్రికా (230)పై ఇంగ్లండ్ (230/8) విజయం సాధించింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments