Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాగా ఆడుతున్నా జట్టు నుంచి తప్పిస్తున్నారు: సురేష్ రైనా

తాను బాగా ఆడుతున్నప్పటికీ జట్టు నుంచి తప్పిస్తున్నారంటూ సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఆరోపించారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది.

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (12:07 IST)
తాను బాగా ఆడుతున్నప్పటికీ జట్టు నుంచి తప్పిస్తున్నారంటూ సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఆరోపించారు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ముగియగా, శుక్రవారం జరిగే చివరి వన్డే మ్యాచ్‌తో ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగియనుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్ ఆరంభంకానుంది. ఇందులో సురేష్ రైనా సభ్యుడిగా ఉన్నాడు. 
 
ఈ సందర్భంగా సురేష్ రైనా స్పందిస్తూ, టీమిండియా తరపున తాను బాగా ఆడినప్పటికీ జట్టు నుంచి తప్పించడం బాధించిందన్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తానేంటో నిరూపించుకునే సమయం వచ్చిందని ఆ అవకాశాన్ని చేజార్చుకోనని రైనా అన్నాడు. తాను బాగా రాణించినప్పటికీ తనను జట్టు నుంచి తొలగించడం బాధ కలిగించిందన్నాడు. 
 
ఇప్పుడు తాను యో-యో టెస్టు పాసయ్యానన్నారు. ఇప్పుడెంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నానని.. ఇన్ని నెలల కఠోర శిక్షణ తర్వాత మళ్లీ భారత జట్టుకు ఆడాలనే కాంక్ష మరింత బలపడిందన్నాడు. దీన్ని ఇక్కడే వదిలిపెట్టనని.. వీలైనన్ని ఎక్కువ రోజులు భారత్‌కు ఆడాలనేదే తన లక్ష్యమన్నాడు. ఇకపోతే, 2019 ప్రపంచకప్‌లో ఆడాలనుకుంటున్నానని తెలిపిన రైనా.. ఇంగ్లాండ్‌లో బాగా రాణిస్తానని తెలుసన్నాడు. 

సంబంధిత వార్తలు

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments