Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమికి కారణాలు ఏంటంటే...

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (11:06 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు ఐసీసీ నిర్వహించే ఈవెంట్లలో వరుసగా భారత్ చేతిలో ఓడిపోతూ వచ్చిన పాకిస్థాన్ జట్టు ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సేన పూర్తిగా తేలిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైంది. ఫలితంగా దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. 
 
ముఖ్యంగా, ఆదిలోనే భారత్ టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగడంతోనే తొలి ప్రభావం పడింది. ఆ తర్వాత ఓపెనర్లుగా బరిలోకి వచ్చిన రోహిత్ శ్రమ (డకౌట్), కేఎల్ రాహుల్‌ (3)లు కేవలం ఆరు పరుగులకే పెవిలియన్‌కు చేరారు. దీంతో మిడిల్ ఆర్డర్‌పై పూర్తి భారం పడింది. 
 
అంచనాలు మించి రాణిస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులు చేయగా కెప్టెన్ కోహ్లీకి, పంత్ దన్నుగా నిలిచి స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. అయితే పంత్ అవుట్ అయ్యాక హార్దిక్(11) కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. బ్యాట్‌తో పూర్తిగా విఫలమయ్యాడు. అయితే, కోహ్లీ ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
ఆ తర్వాత బౌలింగ్‌లోనూ భారత్ బౌలర్లు పేలవమైన బౌలింగ్‌తో గల్లీస్థాయి బౌలింగ్‌తో ఆలరించారు. అశ్విన్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగా నాలుగు ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చాడు. తద్వారా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. అశ్విన్ బరిలోకి దిగి ఉంటే.. అతడి అనుభవం ఖచ్చితంగా ఉపయోగపడేది. 
 
అలాగే, ఏమాత్రం ఫామ్‌లోని భువనేశ్వర్‌ను శార్దూల్ స్థానంలో తీసుకోవడం టీమిండియాకు మైనస్ అయింది. శార్దూల్ ఠాకూర్.. అటు బ్యాట్‌తో ఇటు బంతి‌తో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. అతడిని ఎందుకు జట్టులోకి తీసుకోలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 
 
రవీంద్ర జడేజా, బుమ్రా, షమీ.. సీనియర్ బౌలర్ల అయిన వీరు పూర్తిగా తేలిపోయారు. అసలు మెంటార్‌గా ధోని సలహాలు ఇచ్చాడా.? లేదా మొత్తం కోహ్లీ ప్లానా.? ఏది ఏమైనా నెటిజన్లు మాత్రం ఈ ఓటమితో టీమిండియాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments