Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

15 వేల దిగువకు కరోనా పాజిటివ్ కేసులు

15 వేల దిగువకు కరోనా పాజిటివ్ కేసులు
, సోమవారం, 25 అక్టోబరు 2021 (10:50 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 14306  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 443 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. 
 
ప్రస్తుతం దేశంలో 1,67,695 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 239 రోజుల్లో అతి తక్కువ యాక్టివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు, దేశంలో అత్యధిక కేసులు కేరళలో నమోదయ్యాయి. 
 
కేరళలో గత 24 గంటల్లో 8,538 కేసులు నమోదు కాగా 71 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 3,41,89,774కి పెరిగాయి. ఇప్పటివరకు 4,54,712 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
 
మరోవైపు, ఆదివారం వెల్లడించిన ప్రకటన మేరకు తెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,842 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 135 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 64 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు గుర్తించారు.
 
వనపర్తి, వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్, నారాయణపేట, ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
 
అదే సమయంలో 168 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,274 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,377 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,950 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,947కి పెరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ఆర్టీసీలో యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా నగదు చెల్లింపులు