Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిస్బేన్ టెస్ట్ : పట్టుబిగిస్తున్న భారత్ - తడబడుతున్న కంగారులు

Webdunia
సోమవారం, 18 జనవరి 2021 (07:30 IST)
బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పట్టుబిగిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు క్రీజ్‌లో తడబడుతున్నారు. ముఖ్యంగా, హైదరాబాదీ బౌలర్‌ సిరాజ్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లను పడగొట్టాడు. 
 
ఇన్నింగ్స్‌ 30వ ఓవర్‌ వేసిన సిరాజ్‌ మొదట లబుషేన్‌ను ఔట్‌ చేశాడు. దీంతో 25 పరుగులు చేసిన లబుషేన్‌ మూడో వికెట్‌ రూపంలో వెనుతిరిగాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన మ్యాథ్యూ వేడ్‌ను డకౌట్‌ చేశాడు. దీంతో ఆసీస్‌ 147 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. 
 
తొలి ఇన్నింగ్స్‌లో లభించిన స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ తడబడుతున్నారు. స్వల్ప పరుగుల తేడాతో వెంటవెంటనే మూడు వికెట్లను కోల్పోయింది. అంతకు ముందు జట్టు స్కోరు 91 పరుగుల వద్ద డేవిడ్‌ వార్నర్‌ను వాషింగ్టన్‌ సుందర్‌ వికెట్ల ముందు దొరకబట్టాడు. 
 
దీంతో 75 బంతుల్లో 48 పరుగులు చేసిన వార్నర్‌ రెండో వికెట్‌ రూపంలో వెనుతిరిగాడు. స్టీవ్‌ స్మిత్ 10 (9), గ్రీన్‌ 1 (8)  ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే హారిస్‌ను శార్ధూల్‌ ఠాకూర్‌ ఔట్‌చేశాడు. ప్రస్తుతం ఆసిస్‌ 160 పరుగుల ఆధిక్యంలో ఉన్నది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments