Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ట్వంటీ20 సమరం.. ధోనీ లేకుండానే బరిలోకి భారత్‌

Webdunia
ఆదివారం, 4 నవంబరు 2018 (12:41 IST)
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ట్వంటీ20 సిరీస్ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అందుబాటులోవుండడు. పైగా, భారత్‌కు ఎన్నో ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో ఫినిషర్‌గా కీలక పాత్ర పోషించిన ధోనీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
2006లో టీ20జట్టుకు ఎంపికవడం, మరుసటి ఏడాదే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడమే కాదు 2007లో పొట్టి క్రికెట్‌ తొలి వరల్డ్‌ కప్‌ను జట్టుకు అందించడం అతడి సత్తాకు నిదర్శనం. అలాంటి గొప్ప బ్యాట్స్‌మన్‌, కీపర్‌ ధోనీ లేకుండా టీమిండియా ఈసారి టీ20 బరిలోకి దిగుతోంది. అలాగే రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లీకి విశ్రాంతి కారణంగా రోహిత్‌ శర్మ సారథ్యంలో భారత జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగే తొలి టీ20లో వెస్టిండీస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.
 
ఇకపోతే, టెస్ట్‌, వన్డే సిరీ్‌సలలో ఘోరంగా ఓడినా కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ సారథ్యంలోని కరీబియన్‌ జట్టు టీ20ల్లో ప్రమాదకారేనని చెప్పొచ్చు. ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో విండీస్‌ కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. 2016 టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్లో బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది తన జట్టుకు ట్రోఫీ అందించాడు. టీ20 స్టార్లు డారెన్‌ బ్రావో, కీరన్‌ పొలార్డ్‌ చేరికతో ఆ జట్టులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. 
 
ఇకపోతే, కెప్టెన్‌ రోహిత్‌కు కలిసి వచ్చిన మైదానమే. వన్డేల్లో 264 పరుగుల వరల్డ్‌ రికార్డును 2014లో అతడు ఇక్కడే నమోదు చేశాడు. అంతేకాదు.. 2013, 2015లో ముంబై ఇండియన్స్‌కు రెండు ఐపీఎల్‌ టైటిళ్లను ఈ గ్రౌండ్‌లోనే అందించాడు. అలాగే ఇటీవల వన్డేల్లో కనబరుస్తున్న అద్భుత ఫామ్‌ను ఈ సిరీస్‌లోనూ కొనసాగించాలని రోహిత్‌ భావిస్తున్నాడు. 
 
ఇరు జట్ల వివరాలు... 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధవన్‌, రాహుల్‌, దినేష్‌ కార్తీక్‌, మనీష్‌ పాండే, రిషభ్‌ పంత్‌ (కీపర్‌), క్రునాల్‌ పాండ్యా, చాహల్‌, కుల్దీప్‌, భువనేశ్వర్‌, బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌,
వెస్టిండీస్‌: బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), ఫాబియన్‌ అలెన్‌, డారెన్‌ బ్రావో, హెట్‌మయెర్‌, కీమో పాల్‌, రామ్‌దిన్‌ (కీపర్‌), రూథర్‌ఫోర్డ్‌, ఓషెన్‌ థాంప్సన్‌, ఖారీ పీయరీ, మెక్‌కాయ్‌, రోవ్‌మన్‌ పొవెల్‌, నికొలాస్‌.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments