Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోని దరిదాపుల్లోకి కూడా రాలేరు.. మహీని పక్కనబెడతారా?: ఆశిష్ నెహ్రా

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (18:16 IST)
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని విండీస్‌తో జరగబోయే ట్వంటీ-20 సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం వివాదంగా మారిన నేపథ్యంలో.. భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా ధోనికి అండగా నిలిచారు. ధోని ఫామ్ గురించి క్రికెట్ అభిమానులు ఆందోళన చెందవద్దని... ఆస్ట్రేలియా పర్యటనలో మళ్లీ ఆయన పామ్ లోకి వస్తారని నెహ్రా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 
 
అయితే ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సీరిస్‌కు ధోనికి ఎంపికచేయక పోవడాన్ని నెహ్రా తప్పుబట్టారు. యువ క్రికెటర్ రిషబ్ పంత్ కోసం అనుభవజ్ఞుడైన ధోనిని పక్కనబెట్టడం సరికాదని తెలిపారు. టీ20 జట్టులో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లు బాగానే ఆడుతున్నారు. కానీ వారెప్పుడూ ధోనీతో సమానం కాదని ఆశిష్ నెహ్రా వ్యాఖ్యానించాడు. వాళ్లిద్దరూ ధోనీకి దరిదాపుల్లోకి కూడా చేరుకోలేరని వ్యాఖ్యానించాడు. 
 
యువ ఆటగాళ్లకు ధోనీ విలువైన సలహాలు, సూచనలు ఇస్తుంటారని తెలిపాడు. మరీ ముఖ్యంగా కెప్టెన్ కోహ్లికి జట్టు సారథ్య బాధ్యతలు నిర్వర్తించడంలో ధోని సాయపడుతున్నాడని ఆశిష్ నెహ్రా వివరించాడు.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments