Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20ల నుంచి ధోనీ అవుటా..? అంత లేదు.. విరాట్ కోహ్లీ

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (14:03 IST)
ట్వంటీ-20ల నుంచి భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్నాడని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కెప్టెన్ విరాట్‌ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. టీ20ల నుంచి ధోనీకి ఉద్వాసన పలికారనడంలో నిజం లేదన్నాడు. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు తగినంత సమయమివ్వాలనే ఆలోచనతోనే ధోనీ తప్పుకొన్నాడని కోహ్లీ స్పష్టం చేశాడు. 
 
వన్డేల్లో మహీ అంతర్భాగమని, 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌లో ధోనీ ఆడతాడని తేల్చి చెప్పాడు. తనకు తెలిసి ధోనీ విషయాన్ని ఇప్పటికే సెలెక్టర్లు కూడా తేల్చి చెప్పేశారు. అందుకే మరోసారి తాను వివరణ ఇవ్వాలనుకోవట్లేదని కోహ్లీ తెలిపాడు.
 
విండీస్, ఆసీస్‌లతో జరిగే టీ20 సిరీస్‌లకు జరిగిన జట్టు ఎంపికలో కూడా తాను పాల్గొనలేదని కోహ్లీ వ్యాఖ్యానించాడు. కానీ జట్టులో ఇప్పటికీ ధోనీ అంతర్భాగమే. టీ20ల్లో యువ కీపర్‌ పంత్‌కు మరిన్ని అవకాశాలు వస్తే మంచిదన్నది ధోనీ ఉద్దేశమని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
 
కాగా ధోనీ బ్యాట్‌తో రాణించకపోయిన తనదైన కీపింగ్ స్కిల్స్‌తో బాగానే ఆకట్టుకున్నాడు. అయితే బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన ధోనీ అంతగా రాణించకపోవడంతోనే టీ20ల నుంచి పక్కన బెట్టారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై అటు సెలెక్టర్లు, ఇటు కెప్టెన్ కోహ్లీ వివరణ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

తర్వాతి కథనం
Show comments