Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్ రాకుండానే కోటి మందికి ఎలా వేస్తారు విజయసాయి రెడ్డిగారు?

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (20:42 IST)
వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి ట్వీట్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరోనా వ్యాక్సిన్ ఇంకా రాకముందే డిసెంబర్ 25వ తేదీ కోటి మందికి కరోనా వ్యాక్సిన్లను వేస్తున్నట్లు ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. ఆ తరువాత సరిగ్గా 15 నిమిషాల్లో ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.
 
కరోనాతో ఇప్పటికీ చాలామంది మరణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అస్సలు కరోనా గురించి సరైన శ్రద్థ తీసుకోలేదని ప్రతిపక్షాలు విమర్సిస్తున్నాయి. అయితే కరోనాకు వ్యాక్సిన్ జనవరి నెలలో వచ్చే అవకాశం ఉందని కేంద్రం ప్రకటించింది. కానీ వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి మాత్రం ఒకడుగు ముందుకు వేసేశారు.
 
డిసెంబర్ నెలలోనే ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్లను వేస్తుందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వీటిని కోటి మందికి వేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఈరోజు మధ్యాహ్నం పెడితే సరిగ్గా 15 నిమిషాల్లో ఆ ట్వీట్‌ను తిరిగి డిలీట్ చేసేశారు. 
 
అసలు దేశంలోకే వ్యాక్సిన్లు రాకపోతే ఎపిలో ఎలా వేస్తారంటూ ప్రశ్నించారు నెటిజన్లు. దీంతో ఆలోచనలో పడ్డ విజయసాయిరెడ్డి.. తిట్ల పురాణాన్ని వినలేక వెంటనే డిలీట్ చేశారు. విజయసాయిరెడ్డి ట్వీట్ పైన ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments