Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడి ఉద్యోగులు గ్రేట్.. కరోనా వైరస్ నిరోధించేందుకు భారీ విరాళం

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (22:36 IST)
ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా వైరస్. అయితే వైరస్ నియంత్రణకు ప్రభుత్వాలకు అవసరమైన డబ్బులు లేవు. అందులోను ఎపిలో ఆర్థిక సమస్య ఎక్కువగా ఉంది. దీంతో పలువురు ప్రముఖులు తమ వంతు సాయంగా విరాళాలను అందిస్తున్నారు. అయితే మొట్టమొదటిసారి తిరుమల శ్రీవారి చెంత పనిచేసే ఉద్యోగులు సిఎం సహాయనిధికి విరాళం ఇచ్చారు.
 
అది కూడా అక్షరాలా 83 లక్షల 86 వేల 747 రూపాయలు. టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డితో కలిసి వెళ్ళిన టిటిడి ఉద్యోగ సంఘాల నాయకులు నేరుగా తాడేపల్లి గూడెంలోని ముఖ్యమంత్రికి చెక్కు రూపంలో నగదును అందజేశారు. టిటిడిలో శాశ్వత ఉద్యోగులు 7 వేల మంది, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 14 వేల మంది ఉన్నారు. మొత్తం 21 వేల మంది ఉద్యోగులు తమ మార్చి నెల జీతం మొత్తాన్ని సిఎంకు విరాళంగా అందజేశారు.
 
టిటిడి ఉద్యోగులు, సిబ్బంది తీసుకున్న నిర్ణయంపై ఉన్నతాధికారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విపత్కరమైన పరిస్థితుల్లో అందరు కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకోవడంపై ముఖ్యమంత్రి కూడా ఆనందం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments