Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఒక్కసారిగా పెరిగిన పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (16:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 61178 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 1367 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 14 మంది మృతి చెందారు. అలాగే, 1248 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. 
 
ఈ కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,34,786కి చేరగా.. ఇందులో 20,06,034 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 14044కి చేరింది.
 
తాజా లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 14,708 యాక్టివ్ కేసులున్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులతో పాటు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా, మృతుల్లో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున కృష్ణ, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments