Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా మూడో దశ అల వచ్చే అవకాశాలు చాలా తక్కువే : ఐసీఎంఆర్ సైంటిస్ట్

Advertiesment
Covid 19
, సోమవారం, 13 సెప్టెంబరు 2021 (17:02 IST)
దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువేనని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ రమణ్ గంగాఖేడ్కర్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే దేశంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువుగా ఉన్నాయన్నారు. అయినప్పటికీ... చిన్నారులను ఇప్పుడే స్కూళ్లకు పంపొద్దని సూచించారు.
 
ఒకవేళ దేశంలో మూడో వేవ్ వచ్చినా కూడా ఇంతకుముందులా అంత ప్రభావం ఉండకపోవచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్కూళ్లు తెర‌వ‌క‌పోవ‌డమే మంచిదని అభిప్రాయపడ్డారు. తప్పని పరిస్థితుల్లో తెరిస్తే మాత్రం ఎక్కువమంది ఉండకుండా రోజుమార్చి రోజు విధానాలు పాటిస్తే మంచిదన్నారు. 
 
తమ సర్వే ప్రకారం మూడింట రెండు వంతుల మందిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందిన‌ట్లు తేలిందని.. అంతేకాకుండా వ్యాక్సిన్ వల్ల కరోనా నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉందన్నారు. 
 
చిన్నారుల‌కు కరోనా సోకినా.. వారిలో రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు. అయినా రిస్క్ తీసుకోవడం మంచిది కాదని.. ప్రజలందరూ జాగ్ర‌త్త‌లు పాటించాలని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి భక్తులకు శుభవార్త, అందరికీ సర్వదర్సనం టోకెన్లు, ఎప్పట్నుంచి అంటే?