Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వ పాఠశాలల్లో కోడింగ్ ట్రైనింగ్

ప్రభుత్వ పాఠశాలల్లో కోడింగ్ ట్రైనింగ్
, సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:46 IST)
తెలంగాణా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వైద్య సౌకర్యాలతో పాటు.. నాణ్యమైన విద్యను అందించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతోంది. అలాగే, విద్యా విధానంలో కూడా సమూల మార్పులు చేస్తూ వస్తోంది. సరికొత్త విద్యా ప్రణాళికతో ముందుకు పోతోంది. 
 
దీంతో ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పించేందుకు తల్లి తండ్రులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ స్కుళ్లపై మరింత దృష్టి పెడుతోంది. తాజాగా ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్థులకు మరో శుభవార్త చెప్పింది. 
 
రాష్ట్ర విద్యాశాఖ, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ మరియు డెల్ టెక్నాలజీస్ సంయుక్తంగా ప్రభుత్వ స్కుల్ళల్లో చదివే విద్యార్థులకు కోడింగ్ పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. కోడింగ్‌తో పాటుగా ఇతర ప్రయోగాలను చేసేందుకుగానూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న 50 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది.
 
ఈ పాఠశాలల్లో దాదాపుగా 20 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది. దాంతో స్కూళ్ళలో అడ్మిషన్ల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రూ అప్ ఛార్జీలేంటి? విద్యుత్ లోటును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి