జొమాటో, స్విగ్గీ ఫుడ్ కావాలా నాయనా? GST వడ్డిస్తారు తింటారా?

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (16:36 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 17వ తేదీన జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్‌ డెలివరీ యాప్‌లను రెస్టారెంట్ల మాదిరిగా పరిగణిస్తూ ఆయా యాప్‌లు సరఫరా చేసే ఆహార పదార్థాలపై 5 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధించాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఈ విషయంపై ఈ జీఎస్టీ మండలి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
 
ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో శుక్రవారం జీఎస్టీ మండలి సమావేశంకానుంది. ఇందులోనే, జీఎస్టీ అంశంతో పాటు దాదాపు 50 ప్రతిపాదనలపై చర్చించనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఫుడ్‌ డెలివరీ యాప్‌ల సేవలపై జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదనకు జీఎస్టీ మండలి ఆమోదముద్ర వేస్తే ఆయా సంస్థలు తమ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసుకునేందుకు కొంత సమయం ఇస్తారు.
 
రెస్టారెంట్ల స్థానంలో ఫుడ్‌ డెలివరీ యాప్‌లు ఆహార పదార్థాల డెలివరీకిగాను జీఎస్టీని వసూలు చేసి, ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల వినియోగదారులపై అదనపు పన్ను భారం ఏమీ పడదు. ఫుడ్‌ డెలివరీ యాప్‌ ద్వారా చిన్నపాటి హోటళ్ల నుంచి కూడా ఆహార పదార్థాలు వినియోగదారులకు అందుతాయి. దీంతో ఆయా హోటళ్లు కూడా జీఎస్టీ చెల్లించాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేల్ ఫెర్టిలిటీ నేపథ్యంగా లవ్ స్టోరీతో సాగే సంతాన ప్రాప్తిరస్తు - నిర్మాతలు

ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ కెమిస్ట్రీతో గత వైభవం ట్రైలర్

జూటోపియా 2 లో జూడీ హాప్స్‌కి వాయిస్‌ ఇచ్చిన శ్రద్ధా కపూర్‌

Faria Abdullah: సందీప్ కిషన్ హీరోగా సిగ్మా పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్

Raviteja: రవితేజ కు ఎదురైన ప్రశ్నల సారాంశంతో భర్త మహాశయులకు విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments