Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 2 లక్షలకు దిగువకు చేరిన కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (11:04 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిట్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. గత మూడు రోజులుగా రెండు లక్షలకు దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గడచిన 24 గంటల్లో 1,72,733 కేసులు నమోదయ్యాయి. 
 
బుధవారం కూడా రెండు లక్షలకు దిగువనే నమోదైన విషయం తెల్సిందే. మరోవైపు, గడిచిన 24 గంటల్లో 25,59,107 మంది బాధితులు కోలుకున్నారు. అదేవిధంగా గత 24 గంటల్లో 1,008 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ నెల ఆరో తేదీ నుంచి వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ జట్టుతో ఆడే భారత క్రికెట్ జట్టును కూడా ఇటీవల బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. అయితే, భారత జట్టులో ఒక్కసారిగా కరోనా కలకలం చెలరేగింది. పలువురు క్రికెటర్లు కరోనా వైరస్ బారినపడ్డారు. 
 
ప్రస్తుతం దేశంలో 15,33,921 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా హోం క్వారంటైన్, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశంలో 4,98,983 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 10.99 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments