పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 21 జులై 2022 (10:53 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బుధవారం 20 వేలకు పైగా నమోదైన కోవిడ్ కేసులు గురువారం 21 వేలు దాటిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులు సంఖ్య 1.50 లక్షలకు చేరువైంది. 
 
గడిచిన 24 గంటల వ్యవధిలో 21 వేలకు పైగా కేసులు రాగా పాజిటివిటీ రేటు 4.25 శాతంగా ఉంది. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువకావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే రికవరీలు కూడా పెరుగుతుండటం మాత్రం సానుకూలాంశం.
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. దేశవ్యాప్తంగా 5,07,360 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 21,566 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. అంటే రోజువారీ పాజిటివిటీ రేటు 21,566గా ఉంది. 
 
మరోవైపు, 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 18,294 ఉంది. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి కోలుకున్నవారి సంఖ్య 4.31 కోట్లకు చేరుకుంది. అంటే రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 1,48,881, క్రియాశీల కేసుల రేటు 0.34 శాతంగా ఉండగా, 24 గంటల్లో మరణాలు 45 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలుకుంటే ఇప్పటివరకు దేశంలో 5.25 లక్షల మంది చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా బైకర్ నుంచి మోటివేషన్ యాంథమ్ జిద్ధి జిద్ధి రిలీజ్

Ajay Bhupathi: తిరుపతిలో శ్రీనివాస మంగాపురం మూడో కీలక షెడ్యూల్‌ పూర్తి

Manchu Manoj :డేవిడ్ రెడ్డి లో హీరోయిన్ గా మారియా ర్యాబోషాప్కా

Ranveer Singh: ధురంధర్ ది రివెంజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

సింగపూర్‌కు చేరుకున్న డిస్నీ అడ్వెంచర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments