Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
గురువారం, 21 జులై 2022 (10:53 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బుధవారం 20 వేలకు పైగా నమోదైన కోవిడ్ కేసులు గురువారం 21 వేలు దాటిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులు సంఖ్య 1.50 లక్షలకు చేరువైంది. 
 
గడిచిన 24 గంటల వ్యవధిలో 21 వేలకు పైగా కేసులు రాగా పాజిటివిటీ రేటు 4.25 శాతంగా ఉంది. ఇక యాక్టివ్‌ కేసుల సంఖ్య లక్షన్నరకు చేరువకావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే రికవరీలు కూడా పెరుగుతుండటం మాత్రం సానుకూలాంశం.
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు.. దేశవ్యాప్తంగా 5,07,360 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 21,566 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. అంటే రోజువారీ పాజిటివిటీ రేటు 21,566గా ఉంది. 
 
మరోవైపు, 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 18,294 ఉంది. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి కోలుకున్నవారి సంఖ్య 4.31 కోట్లకు చేరుకుంది. అంటే రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 1,48,881, క్రియాశీల కేసుల రేటు 0.34 శాతంగా ఉండగా, 24 గంటల్లో మరణాలు 45 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలుకుంటే ఇప్పటివరకు దేశంలో 5.25 లక్షల మంది చనిపోయారు. 

సంబంధిత వార్తలు

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments