విండ్ షీల్డ్‌కు ఏర్పడిన పగుళ్లు... విమానం అత్యవసర ల్యాండింగ్

Webdunia
గురువారం, 21 జులై 2022 (10:21 IST)
దేశ రాజధాని ఢిల్లీ నుంచి గౌహతికి బయలుదేరిన ‘గో ఫస్ట్‌’ ఏ320 నియో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ విమానం విండ్‌షీల్డుకు (ముందు భాగం) పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని గుర్తించిన పైలెట్లు తక్షణం అప్రమత్తమై విమానాన్ని జైపుర్‌కు దారి మళ్లించారు. 
 
తొలుత ఈ విమానాన్ని ఢిల్లీకి వెనక్కి తీసుకెళ్లాలని భావించారు. కానీ, భారీవర్షం కురుస్తున్న కారణంగా సాధ్యపడలేదు. బుధవారం మధ్యాహ్నం తలెత్తిన ఈ సాంకేతిక లోపం ‘గో ఫస్ట్‌’ విమాన సర్వీసుల్లో గత రెండు రోజుల్లో మూడో ఘటనగా పౌరవిమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) అధికారులు తెలిపారు. 
 
ప్రయాణికులను జైపూర్‌ నుంచి మరో విమానంలో గౌహతికి పంపామని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఎదురవకుండా చూసినట్లు ‘గో ఫస్ట్‌’ అధికార ప్రతినిధి తెలిపారు. దేశంలోని వివిధ విమాన సర్వీసుల్లో గత నెల రోజుల్లో సాంకేతిక లోపాలకు సంబంధించిన ఘటనలు పెద్దసంఖ్యలో నమోదుకావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ విష్ణుప్రియతో నాకు పెళ్లా.. ఎవరు చెప్పారు? జేడీ చక్రవర్తి ప్రశ్న

Heroes: హీరోల పారితోషికంలో సినిమారంగంలో పెను మార్పులు రాబోతున్నాయా?

Samantha: మా ఇంటి బంగారం లో నేనే హీరో అంటున్న సమంత

Dhanush: కర సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది : హీరో ధనుష్

రీ రిలీజ్‌లో దుమ్మురేపుతున్న ప్రభాస్ డార్లింగ్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?

summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు

ప్రపంచ మలేరియా దినోత్సవం- గర్భధారణ సమయంలో మలేరియా.. గుర్తించకపోతే...?

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments