నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న సోనియా గాంధీ

Webdunia
గురువారం, 21 జులై 2022 (09:56 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమె విచారణను ఎదుర్కోనున్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ విచారణ చేయనుంది. ఇప్పటికే ఈ కేసులో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీని విచారించారు.
 
ఆ సమయంలో సోనియా గాంధీ కరోనా వైరస్ కారణంగా ఆస్పత్రిలో చేరివున్నారు. ప్రస్తుతం ఆమె ఇంటికి రావడంతో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీచేసింది. దీంతో ఆమె గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరుకానున్నారు. 
 
మరోవైపు, సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఆందోళనల్లో కాంగ్రెస్ నేతలు పాల్గొనున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఈడీ కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టనున్నారు. 
 
మరోవైపు, కాంగ్రెస్ వర్గాల నిరసనల నేపథ్యంలో ఢిల్లీ భారీగా పోలీసులు మొహరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్డును ఇప్పటికే మూసివేశారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా భారీ సంఖ్యలో బారీకేడ్లు ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments