Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 4 March 2025
webdunia

దేశంలో ఒక్కసారిగా 20 వేలు దాటికి కరోనా పాజిటివ్ కేసులు

Advertiesment
coronavirus
, బుధవారం, 20 జులై 2022 (10:57 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 20557 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,38,03,619కు చేరాయి. ఇందులో 4,31,13,623 మంది కోలుకోగా మరో 5,25,785 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1,45,654 కరోనా యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నాయి. 
 
మరోవైపు గడిచిన 24 గంటల్లో 18517 మంది కరోనా బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అలాగే, రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతానికి తగ్గింది. 
 
ఇంకోపైవు, దేశవ్యాప్తంగా ఇప్పటివరు 200.61 కోట్ల మందికి కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు. ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.33 శాతంగా ఉండగా, రికవరీ శాతం 98.47 శాతంగా ఉంది. మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేషనల్ లాలీపాప్ డే.. లాలీ పాప్ అంటే నాలుక చప్పుడు తెలుసా?