Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యంగా ఉన్న ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థులు

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (10:23 IST)
కోవిడ్‌-19 నేప‌థ్యంలో లాక్డౌన్ అనంత‌రం 5 రోజుల ముందు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మొత్తం 435 మంది విద్యార్థులు త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యారు. వీరంద‌రూ త‌మ స్వ‌స్థ‌లాల్లో కోవిడ్ ఆర్‌టిపిసిఆర్ ప‌రీక్ష‌లు చేయించుకుని నెగెటివ్ రిపోర్టు స‌మ‌ర్పించారు. 
 
అయితే, మార్చి 9న విద్యార్థులంద‌రికీ మ‌రొక‌మారు క‌రోనా ర్యాపిడ్ ప‌రీక్ష నిర్వ‌హించ‌గా, ఎలాంటి వ్యాధి ల‌క్ష‌ణాలు లేక‌పోయినా 57 మంది విద్యార్థుల‌కు పాటిజివ్ రిపోర్టు వ‌చ్చింది. అధికారులు వెంట‌నే స్పందించి మెరుగైన వైద్య చికిత్స‌ల కోసం తిరుప‌తిలోని స్విమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డ‌మైన‌ది. 
 
మ‌ళ్లీ వారికి ఆర్‌టిపిసిఆర్ ప‌రీక్ష చేయించ‌డం జ‌రిగింది. ఫ‌లితాలు రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం వారికి ఎలాంటి వ్యాధి లక్ష‌ణాలు లేవు. వారు ప‌రిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. త్వ‌ర‌లోనే వారిని డిశ్చార్జి చేస్తారు. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా టిటిడి అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటోంది.
 
ఈ నేప‌థ్యంలో మిగిలిన 378 మంది విద్యార్థుల‌కు, 35 మంది అధ్యాప‌కుల‌కు, 10 మంది ఇత‌ర సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, అంద‌రికీ నెగెటివ్ రిపోర్టు వ‌చ్చింది. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments