Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదేలో అర్చకులకు కరోనా పాజిటివ్?

Webdunia
గురువారం, 16 జులై 2020 (11:48 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో ఏడుగురు అర్చకులకు కరోనా వైరస్ సోకింది. ఈ ఏడుగురుతో కలుపుకుని కరోనా వైరస్ బారినపడిన మొత్తం అర్చకుల సంఖ్య 15కు చేరింది. 
 
తాజాగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన అర్చకులను శ్రీనివాసం క్వారంటైన్‌కు తరలించారు. ఈ అర్చకులు ఆలయంలో, పరిసర ప్రాంతాల్లో ఎవరెవరిని కలిశారు. ఎంతమందిని కలిసారన్న అంశాలపై ఆరా తీస్తున్నారు.
 
మరోవైపు, విషయం తెలుసుకున్న తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి... అత్యవసరంగా తితిదే అధికారులతో సమావేశమయ్యారు. తిరుమల గిరుల్లో కరోనా తీవ్రతపై వారు చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 
 
కాగా, తితిదేలో పని చేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. ఈ సిబ్బంది సంఖ్య వందకుపైగానే ఉంది. దీంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. ఇపుడు అర్చకులకు కూడా వైరస్ సోకిందన్న సమాచారంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: చిన్నప్పుడు విన్న కథ తెరపై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు : ఎన్టీఆర్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments