Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదేలో అర్చకులకు కరోనా పాజిటివ్?

Webdunia
గురువారం, 16 జులై 2020 (11:48 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో ఏడుగురు అర్చకులకు కరోనా వైరస్ సోకింది. ఈ ఏడుగురుతో కలుపుకుని కరోనా వైరస్ బారినపడిన మొత్తం అర్చకుల సంఖ్య 15కు చేరింది. 
 
తాజాగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన అర్చకులను శ్రీనివాసం క్వారంటైన్‌కు తరలించారు. ఈ అర్చకులు ఆలయంలో, పరిసర ప్రాంతాల్లో ఎవరెవరిని కలిశారు. ఎంతమందిని కలిసారన్న అంశాలపై ఆరా తీస్తున్నారు.
 
మరోవైపు, విషయం తెలుసుకున్న తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి... అత్యవసరంగా తితిదే అధికారులతో సమావేశమయ్యారు. తిరుమల గిరుల్లో కరోనా తీవ్రతపై వారు చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 
 
కాగా, తితిదేలో పని చేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. ఈ సిబ్బంది సంఖ్య వందకుపైగానే ఉంది. దీంతో తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. ఇపుడు అర్చకులకు కూడా వైరస్ సోకిందన్న సమాచారంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. 

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments