Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు పొరలున్న మాస్క్‌తో 70 శాతం రక్షణ

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (11:09 IST)
దేశం కరోనా వైరస్ మహమ్మారి గుప్పెట్లో చిక్కుకుంది. ఈ వైరస్ బారినపడుకుండా ఉండేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి ముఖానికి మాస్క్‌లు ధరిస్తున్నారు. 
 
అయితే, కరోనా వైరస్ సోకకుండా కేవలం సర్జికల్ మాస్క్ మాత్రమే ధరించాలన్న నియమ నిబంధన లేదనీ, మూడు పొరలు ఉన్న క్లాత్ మాస్క్ అయినా సరిపోతుందని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
మూడు పొరలతో కూడిన క్లాత్ మాస్కు కూడా సర్జికల్ మాస్క్ స్థాయిలోనే పనిచేస్తుందని బ్రిస్టల్, సర్రే విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది.
 
మూడు పొరలతో ఉన్న మాస్క్ ధరించిన వారు శ్వాస తీసుకునేటప్పుడు లోపలికి వెళ్లే గాలి మెలి తిరుగుతుందని, ఫలితంగా వైరస్‌తో కూడిన గాలి తుంపర్లు గాలి వెళ్లే మార్గం ద్వారా వెళ్లలేవని తేలింది. 
 
మాస్కులోని పోగులను ఢీకొట్టి అవి అక్కడే ఆగిపోతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సరిగా ధరించే మూడు పొరల మాస్క్ వల్ల 50 నుంచి 70 శాతం వరకు రక్షణ లభిస్తుందని వివరించారు.
 
అలాగే, ఇటీవల భారత్‌లో జరిగిన ఓ అధ్యయనంలో కూడా మూడు పొరలున్న క్లాత్ మాస్కే ఉత్తమని తేలింది కూడా. దీంతో పలువురు ఈ తరహా మాస్కులను ధరిస్తున్నారు. అయితే, డబ్బున్నవారు మాత్రం ఎన్95 మాస్కులను ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments