Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఎనిమిది మంది మృతి

Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (10:52 IST)
తెలంగాణాలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. రోజూ రెండు వేలకు తక్కువగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గురువారం 2,176 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,81,627 కేసులు నమోదు అయ్యాయి.

ఇక గురువారం కరోనాతో ఎనిమిది మంది మరణించారు. ఇప్పటివరకు 1080 మంది కరోనాతో మృతి చెందారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 30,387గా ఉన్నాయి.
 
ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,50,160 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 82.67% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 81.71% శాతంగా ఉంది.

తెలంగాణాలో మరణాలు 0.59 %గా ఉన్నాయి. రాష్ట్రంలో గురువారం 57,621 పరీక్షలు చేశారు. అలాగే గురువారం ఒక్క రోజే 2,021 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా అంటే 386 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments