Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఎనిమిది మంది మృతి

Telangana
Webdunia
శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (10:52 IST)
తెలంగాణాలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. రోజూ రెండు వేలకు తక్కువగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గురువారం 2,176 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,81,627 కేసులు నమోదు అయ్యాయి.

ఇక గురువారం కరోనాతో ఎనిమిది మంది మరణించారు. ఇప్పటివరకు 1080 మంది కరోనాతో మృతి చెందారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 30,387గా ఉన్నాయి.
 
ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,50,160 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 82.67% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 81.71% శాతంగా ఉంది.

తెలంగాణాలో మరణాలు 0.59 %గా ఉన్నాయి. రాష్ట్రంలో గురువారం 57,621 పరీక్షలు చేశారు. అలాగే గురువారం ఒక్క రోజే 2,021 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా అంటే 386 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments