తెలంగాణ పోలీస్ శాఖలో తొలి కరోనా మరణం

Webdunia
గురువారం, 21 మే 2020 (15:08 IST)
కరోనా వైరస్ దెబ్బకు అనేక మంది చనిపోతున్నారు. తెలంగాణా రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారిలో 40 మంది చనిపోయారు. అయితే, కరోనా వైరస్ బారినపడుకుండా ప్రజలను కాపాడుతూ కోవిడ్ వారియర్స్‌లలో ఒకరైన పోలీసులు కూడా ఈ వైరస్ బారినపడి చనిపోతున్నారు. తాజాగా తెలంగాణ పోలీసు శాఖలో ఓ కరోనా మరణం నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర డీజీపీ కార్యాలయం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మన్సూరాబాద్‌కు చెందిన దయాకర్‌ రెడ్డి.. జియగూడలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయనకు కరోనా సోకగా ఆస్పత్రిలో ఉంటూ చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, బుధవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న డీజీపీ మహేందర్ రెడ్డి... మృతుడు దయాకర్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని డీజీపీ భరోసానిచ్చారు. అలాగే దయాకర్ రెడ్డి అంత్యక్రియలు కేవలం ఐదుగురితో జరిపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments