Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా కలకలం.. ఇద్దరు ఎంపీలకు పాజిటివ్

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (11:51 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణాలో మొత్తం 6 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 1298కి చేరింది. భద్రాద్రి కొత్తగూడెంలో 86, జీహెచ్ఎంసిలో 249, కరీంనగర్ 75, ఖమ్మం 89, మేడ్చల్ మల్కాజ్ గిరి 111, నల్గొండ 79, రంగారెడ్డి 97 కేసులు నమోదయ్యాయి. 
 
తెలంగాణాలో రికవరీ రేటు 90.53% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 89.5% శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇద్దరు రాజకీయ నేతలు కరోనాబారిన పడ్డారు. రాష్ట్రంలో ఇద్దరు ఎంపీలు కరోనా బారిన పడ్డారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కోమటిరెడ్డి ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ క్రమంలో కొవిడ్‌ సోకినట్లు అనుమానంగా ఉందని సమాచారం. అలాగే జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌ కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. 
 
అయితే ప్రస్తుతం తాము ఆరోగ్యంగానే ఉన్నామని ఎంపీలు తెలిపారు. వారం రోజులుగా తమతో కాంటాక్ట్‌ ఉన్న వ్యక్తులు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఎవరో ఆందోళన చెందవద్దన్నారు. మరోవైపు తెలంగాణలో తాజాగా 1421 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,001 కి చేరింది. ఇందులో 2,07,326 మంది కోలుకొని ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 20,377 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments