శాంతించని కరోనా.. కొత్తగా 69 వేల పాజిటివ్ కేసులు - తెలంగాణాలో లక్ష క్రాస్

Webdunia
శనివారం, 22 ఆగస్టు 2020 (13:08 IST)
దేశంలో కరోనా వైరస్ ఏమాత్రం శాంతించడం లేదు. దేశంలో కొత్తగా మరో 69878 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదయ్యాయి. అలాగే, 945 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 29,75,702కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 55,794కి పెరిగింది. ఇక 6,97,330 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 22,22,578 మంది కోలుకున్నారు.
 
కాగా, నిన్నటి వరకు మొత్తం 3,44,91,073 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,23,836 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు లక్ష దాటాయి. కొత్తగా 2,474  మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. అదేసమయంలో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,768 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,865కి చేరింది. ఆసుపత్రుల్లో 22,386 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 78,735 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 744కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 447 మందికి కొత్తగా కరోనా సోకింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments