Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కరోనా కలకలం.. తణుకు ఎమ్మెల్యేకు పాజిటివ్

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (14:15 IST)
Tanuku MLA
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కరోనా కలకలం రేగింది. కరోనా మహమ్మారి అసెంబ్లీని కూడా తాకింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వరరావుకి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. అయితే ఆయన రెండు రోజులుగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇప్పుడు ఇదే విషయం అసెంబ్లీలో హాట్‌ టాపిక్‌గా మారింది. రెండు రోజులుగా ఆయనను కలిసిన ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
 
ఇదిలా ఉంటే తనకు కరోనా సోకినట్లు తేలడంతో ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలకు నాగేశ్వరరావు హాజరు కావడం లేదు. ఆయనను కలిసిన ఎమ్మెల్యేలు సైతం హోం క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం.
 
ఇదిలా ఉంటే, ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,68,749 కి చేరింది. కొత్తగా నలుగురు వ్యక్తులు కరోనా వల్ల మృతి చెందారు. దీంతో మొత్తం మరణాలు 6,996కి చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 7,427 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments