Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి కుటుంబంలోని నలుగురికి కరోనా

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (13:04 IST)
health secretary
తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి జే రాధాకృష్ణన్‌ కుటుంబంలోని నలుగురికి కరోనా సోకింది. తాజాగా రాధాకృష్ణన్‌ భార్య, కుమారుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొవిడ్‌-19 టెస్టులో రాధాకృష్ణన్‌కు కోవిడ్‌-19 నెగెటివ్‌గా తేలింది.
 
ఇంతకుముందే రాధాకృష్ణన్‌ మామ, అత్త కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం నలుగురు కరోనా బాధితులు చెన్నైలోని గిండిలో గల కింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రిసెర్చ్‌లో చికిత్స పొందుతున్నారు.
 
తమిళనాడులో సోమవారం కొత్తగా 4,985 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,75,678కు పెరిగింది. ఒక్క చెన్నైలోనే 1,298 మందికి వైరస్‌ సోకింది. 
 
మరోవైపు భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కోనసాగుతోంది. పాజిటివ్ కేసులు ప్రస్తుతం 11 లక్షల 55వేలు దాటాయి. గత 24 గంటలలో అత్యధికంగా 37,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా వల్ల కొత్తగా 587 మంది మృతి చెందారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments