Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి కుటుంబంలోని నలుగురికి కరోనా

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (13:04 IST)
health secretary
తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి జే రాధాకృష్ణన్‌ కుటుంబంలోని నలుగురికి కరోనా సోకింది. తాజాగా రాధాకృష్ణన్‌ భార్య, కుమారుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొవిడ్‌-19 టెస్టులో రాధాకృష్ణన్‌కు కోవిడ్‌-19 నెగెటివ్‌గా తేలింది.
 
ఇంతకుముందే రాధాకృష్ణన్‌ మామ, అత్త కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం నలుగురు కరోనా బాధితులు చెన్నైలోని గిండిలో గల కింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ అండ్‌ రిసెర్చ్‌లో చికిత్స పొందుతున్నారు.
 
తమిళనాడులో సోమవారం కొత్తగా 4,985 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,75,678కు పెరిగింది. ఒక్క చెన్నైలోనే 1,298 మందికి వైరస్‌ సోకింది. 
 
మరోవైపు భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కోనసాగుతోంది. పాజిటివ్ కేసులు ప్రస్తుతం 11 లక్షల 55వేలు దాటాయి. గత 24 గంటలలో అత్యధికంగా 37,148 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా వల్ల కొత్తగా 587 మంది మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments