Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను జయించిన వృద్ధ దంపతులకు వేధింపులే మిగిలాయ్..

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (23:06 IST)
ఓ వైపు మనం పోరాడాల్సింది కరోనాతో.. కానీ, రోగితో కాదంటూ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రోగులపై వేధింపులు అధికమవుతున్నాయి. తాజాగా తమిళనాడుకు చెందిన 103 ఏళ్ల వృద్ధురాలు హమీదా బీ కూడా కరోనాతో పోరాటం చేసి విజయం సాధించింది.. కానీ, ఆమె ఉండే ప్రాంతంలోని స్థానికుల వేధింపులు, బెదిరింపులు పెరిగిపోవడం తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన హమీదా బీ అనే వృద్ధురాలు కరోనా బారినపడ్డారు. అయితే.. అంబూర్ ఆస్పత్రిలో చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంగా మళ్లీ ఇంటికి చేరుకున్నారు. కానీ, చుట్టుపక్కల నివాసం ఉండేవాళ్లు ఆమెను వింతగా చూడడం.. సూటిపోటి మాటలు కూడా అనడంతో ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. 
 
దాదాపు 15 ఏళ్లుగా అదే ఇంట్లో అద్దెకు ఉంటుండగా.. వృద్ధురాలికి కరోనా వచ్చిన తర్వాత ఇంటి యజమాని కూడా వేధింపులకు గురిచేశాడని.. వెంటనే ఖాళీ చేయాలంటూ వేధించసాగాడు.. ఒక ఇరుగుపొరుగువారి నుంచి కూడా అనేక అవమానాలు ఎదురయ్యాయని ఆ వృద్ధురాలు వాపోయింది. 
 
కానీ ఈ విషయం అధికారులకు తెలియడంతో.. ఆమె ఇంటికి వచ్చిన స్థానిక అధికారి గాయత్రి సుబ్రమణి... హమీదా బీను ఓదార్చారు. మీ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఫించన్ కూడా ఇస్తామని వెల్లడించి ధైర్యాన్ని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments