Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాను జయించిన వృద్ధ దంపతులకు వేధింపులే మిగిలాయ్..

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (23:06 IST)
ఓ వైపు మనం పోరాడాల్సింది కరోనాతో.. కానీ, రోగితో కాదంటూ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రోగులపై వేధింపులు అధికమవుతున్నాయి. తాజాగా తమిళనాడుకు చెందిన 103 ఏళ్ల వృద్ధురాలు హమీదా బీ కూడా కరోనాతో పోరాటం చేసి విజయం సాధించింది.. కానీ, ఆమె ఉండే ప్రాంతంలోని స్థానికుల వేధింపులు, బెదిరింపులు పెరిగిపోవడం తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన హమీదా బీ అనే వృద్ధురాలు కరోనా బారినపడ్డారు. అయితే.. అంబూర్ ఆస్పత్రిలో చికిత్స పొంది పూర్తి ఆరోగ్యంగా మళ్లీ ఇంటికి చేరుకున్నారు. కానీ, చుట్టుపక్కల నివాసం ఉండేవాళ్లు ఆమెను వింతగా చూడడం.. సూటిపోటి మాటలు కూడా అనడంతో ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. 
 
దాదాపు 15 ఏళ్లుగా అదే ఇంట్లో అద్దెకు ఉంటుండగా.. వృద్ధురాలికి కరోనా వచ్చిన తర్వాత ఇంటి యజమాని కూడా వేధింపులకు గురిచేశాడని.. వెంటనే ఖాళీ చేయాలంటూ వేధించసాగాడు.. ఒక ఇరుగుపొరుగువారి నుంచి కూడా అనేక అవమానాలు ఎదురయ్యాయని ఆ వృద్ధురాలు వాపోయింది. 
 
కానీ ఈ విషయం అధికారులకు తెలియడంతో.. ఆమె ఇంటికి వచ్చిన స్థానిక అధికారి గాయత్రి సుబ్రమణి... హమీదా బీను ఓదార్చారు. మీ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఫించన్ కూడా ఇస్తామని వెల్లడించి ధైర్యాన్ని చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments