సౌతాఫ్రికా నుంచి థానేకు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (08:43 IST)
ప్రపంచాన్ని ఒమిక్రాన్ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా భారత్‌లో కూడా ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానేకు వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో అతన్ని ఐసోలేషన్‌కు తరలించారు. 
 
థానే జిల్లాలని దొంబివ్లీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 24వ తేదీ నుంచి సౌతాఫ్రికా నుంచి ఢిల్లీకి వచ్చాడు. అక్కడ నుంచి ముంబైకు చేరుకున్నాడు. అయితే, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయని నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. వీటిని పరిశీలించగా, అతనికి ఒమిక్రాన్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఈ పరీక్షలు చేశారు. అయితే, ఫలితాలు రావాల్సివుంది. 
 
మరోవైపు, ఆదివారం సౌతాఫ్రికా నుంచి బెంగుళూరుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కూడా పాజిటివ్ వచ్చిన విషయం తెల్సిందే. అయితే, వారికి సోకింది ఒమిక్రాన్ కాదని, డెల్టా స్ట్రెయిన్ అని పరీక్షల్లో తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments