Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికా నుంచి థానేకు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (08:43 IST)
ప్రపంచాన్ని ఒమిక్రాన్ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో ఈ వైరస్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా భారత్‌లో కూడా ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి మహారాష్ట్రలోని థానేకు వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో అతన్ని ఐసోలేషన్‌కు తరలించారు. 
 
థానే జిల్లాలని దొంబివ్లీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 24వ తేదీ నుంచి సౌతాఫ్రికా నుంచి ఢిల్లీకి వచ్చాడు. అక్కడ నుంచి ముంబైకు చేరుకున్నాడు. అయితే, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయని నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. వీటిని పరిశీలించగా, అతనికి ఒమిక్రాన్ అని నిర్ధారణ అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఈ పరీక్షలు చేశారు. అయితే, ఫలితాలు రావాల్సివుంది. 
 
మరోవైపు, ఆదివారం సౌతాఫ్రికా నుంచి బెంగుళూరుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కూడా పాజిటివ్ వచ్చిన విషయం తెల్సిందే. అయితే, వారికి సోకింది ఒమిక్రాన్ కాదని, డెల్టా స్ట్రెయిన్ అని పరీక్షల్లో తేలింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments