తీహార్ జైలులో ఖైదీకి కరోనా - వుహాన్‌లో మళ్లీ వైరస్ అలజడి

Webdunia
సోమవారం, 11 మే 2020 (14:52 IST)
ఢిల్లీలోని తీహార్ జైలులో ఓ ఖైదీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జైలు వర్గాలు ఉలిక్కిపడ్డాయి. అత్యాచార ఆరోపణల కింద అరెస్టు అయి తీహార్ జైలుకు వచ్చిన ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇతర జైలు సిబ్బంది, అధికారులను కూడా హోం క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, ఆ ఖైదీ ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారో తెలుసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అదేసమయంలో జైలు సిబ్బందిలో కూడా ఆందోళన నెలకొంది. 
 
మరోవైపు, కరోనా వైరస్ పురుడు పోసుకున్న వుహాన్ నగరంలో మళ్లీ కలకలం చెలరేగింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో వుహాన్‌లో అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా, లాక్డౌన్ ఎత్తివేసి ఆఫీసులు, కొన్ని విద్యాసంస్థలు, సినిమా హాళ్లు, మ్యూజియంలు, ఇతర వినోద కేంద్రాలకు అనుమతి ఇచ్చారు. 
 
దీంతో కరోనా వైరస్ సద్దుమణిగిందని వుహాన్ వాసులు భావించారు. అయితే, తాజాగా ఇక్కడ కరోనా కలకలం మళ్లీ మొదలైంది. ఒకే కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న ఐదుగురు వ్యక్తులతో పాటు మొత్తం ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా కరోనా బారినపడినవారిలో ఓ వృద్ధురాలు కూడా ఉంది. ఆమె భర్తకు ఇటీవలే కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా కరోనా నిర్ధారణ అయిన ఐదుగురిలోనూ ఎలాంటి లక్షణాలు లేకపోవడం కూడా అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments