Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఇంట్లో ఆరుగురికి 'కరోనా' సోకింది : కర్నూలు వైకాపా ఎంపీ

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (09:59 IST)
కర్నూలు జిల్లాలో అధికార వైకాపాకు చెందిన పార్లమెంట్ సభ్యుడు సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులను కరోనా వైరస్ కాటేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు సభ్యులు ఈ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఎంపీగారే స్వయంగా వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కేసుల్లో అగ్రస్థానంలో ముంది. ముఖ్యంగా, కర్నూలు కరోనా హాట్‌స్పాట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ ఇంటికి ఈ వైరస్ వ్యాపించింది. ఫలితంగా ఆరుగురికి సోకింది. 
 
ఇందులో ఎంపీకి చెందిన ఇద్దరు సోదరులు, వీరి భార్యలు, ఒకరి కుమారుడికి, 83 ఏళ్ల తండ్రికి సోకినట్లు ఎంపీ వెల్లడించారు. అయితే, తండ్రి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. 
 
కరోనా సోకిన ఈ ఆరుగురిలో నలుగురు వైద్యులు ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశం. వీరంతా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, లాక్‌డౌన్ వల్ల అంతగా ఉపయోగం ఉండడంలేదని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకుతుందని ఎంపీ అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments