Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఇంట్లో ఆరుగురికి 'కరోనా' సోకింది : కర్నూలు వైకాపా ఎంపీ

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (09:59 IST)
కర్నూలు జిల్లాలో అధికార వైకాపాకు చెందిన పార్లమెంట్ సభ్యుడు సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులను కరోనా వైరస్ కాటేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు సభ్యులు ఈ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఎంపీగారే స్వయంగా వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కేసుల్లో అగ్రస్థానంలో ముంది. ముఖ్యంగా, కర్నూలు కరోనా హాట్‌స్పాట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ ఇంటికి ఈ వైరస్ వ్యాపించింది. ఫలితంగా ఆరుగురికి సోకింది. 
 
ఇందులో ఎంపీకి చెందిన ఇద్దరు సోదరులు, వీరి భార్యలు, ఒకరి కుమారుడికి, 83 ఏళ్ల తండ్రికి సోకినట్లు ఎంపీ వెల్లడించారు. అయితే, తండ్రి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. 
 
కరోనా సోకిన ఈ ఆరుగురిలో నలుగురు వైద్యులు ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశం. వీరంతా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, లాక్‌డౌన్ వల్ల అంతగా ఉపయోగం ఉండడంలేదని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకుతుందని ఎంపీ అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments