Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఇంట్లో ఆరుగురికి 'కరోనా' సోకింది : కర్నూలు వైకాపా ఎంపీ

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (09:59 IST)
కర్నూలు జిల్లాలో అధికార వైకాపాకు చెందిన పార్లమెంట్ సభ్యుడు సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులను కరోనా వైరస్ కాటేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఆరుగురు సభ్యులు ఈ వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఎంపీగారే స్వయంగా వెల్లడించారు. 
 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ కేసుల్లో అగ్రస్థానంలో ముంది. ముఖ్యంగా, కర్నూలు కరోనా హాట్‌స్పాట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీగా ఉన్న సంజీవ్ కుమార్ ఇంటికి ఈ వైరస్ వ్యాపించింది. ఫలితంగా ఆరుగురికి సోకింది. 
 
ఇందులో ఎంపీకి చెందిన ఇద్దరు సోదరులు, వీరి భార్యలు, ఒకరి కుమారుడికి, 83 ఏళ్ల తండ్రికి సోకినట్లు ఎంపీ వెల్లడించారు. అయితే, తండ్రి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. 
 
కరోనా సోకిన ఈ ఆరుగురిలో నలుగురు వైద్యులు ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశం. వీరంతా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, లాక్‌డౌన్ వల్ల అంతగా ఉపయోగం ఉండడంలేదని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకుతుందని ఎంపీ అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments