Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ అస్వస్థతకు గురైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఎక్మో సపోర్ట్ మీద చికిత్స

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (19:03 IST)
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుకు కరోనా సోకడంతో సుమారు 40 రోజులుగా అదే ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకుంటున్న సమయంలో ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. కరోనా తగ్గినా ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. 
 
ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.  ఓ దశలో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినప్పటికీ చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు ప్రత్యేక చికిత్స అందించి, ఆయన కోలుకునేలా చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ బాలు ఇప్పుడు మరోసారి ఆసుపత్రిలో చేరటంతో ఆయన అభిమానులంతా ఆందోళకు గురవుతున్నారు.
 
ఆసుపత్రి నుండి బాలు ఆరోగ్యంపై బులెటిన్ వెలువడింది. ఆయన ఆరోగ్య పరిస్థితి 24 గంటల వ్యవధిలో బాగా క్షీణించినట్టు పేర్కొంది. అయితే ఆయనకి ఇంకా ఎక్మో సపోర్ట్ మీద చికిత్స అందిస్తున్నారు. 
బాలసుబ్రహ్మణ్యంకు ప్రస్తుతానికి లైఫ్ సపోర్ట్ మీదనే చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆసుపత్రి చెబుతోంది. నిజానికి ఈ నెల 19 నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులిటెన్‌ని విడుదల చేయలేదు. కుమారుడు చరణే రోజూ అబిమానుల కోసం ఈ సమాచారాన్ని అందిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments