Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల గుండెల్లో బీజేపి రెండు బాంబులు: మంత్రి హరీష్ రావు విమర్శల వర్షం

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (18:57 IST)
బీజేపీపై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శల వర్షం కురిపించారు. ఇవాళ సిద్దిపేట జిల్లా రాయప్రోలు మండల కేంద్రంలో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, వర్షాలకు కూలిన ఇళ్లకు నష్ట పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు రైతుబంధు పథకం లేదన్నారు.
 
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతుల గుండెల్లో రెండు బాంబులు వేసిందని పేర్కొన్నారు. 70 లక్షల మెట్రిక్ టన్నుల విదేశీ మొక్కలు కొనుగోలు కోసం అగ్రిమెంట్ చేశారని, ఎవరి ప్రయోజనం కోసం చేశారో సమాధానం చెప్పాలని బీజేపీ పార్టీని ప్రశ్నించారు. అలాగే బావుల వద్ద, బోర్ల వద్ద మీటర్లు పెట్టి కరెంటు బిల్లులు వసూళ్లు చేయాలని రైతులకు అన్యాయం జరిగేలా చర్యలు చేపట్టిందని విమర్శించారు.
 
వ్యవసాయ మార్కెట్లను రద్దు చేసి కార్పోరేటీకరణకు తెరలేపి నయా జమిందారీ వ్యవస్థను తెస్తోందని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, రైతుల కోసమే సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎప్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఆర్డీవో విజయేందర్ రెడ్డి ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments